జగన్ సింహం అయితే.. షర్మిల మాత్రం శివంగే – వైసీపీ ఎంపీ

-

 

జగన్ మోహన్ రెడ్డి సింహమో కాదో తెలియదు కానీ షర్మిల మాత్రం శివంగేనని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. ఈ మూర్ఖులు మాట్లాడే మాటలకు ఆమె బెదిరిపోతుందా? అని ప్రశ్నించారు. షర్మిల గారు టకాటక నిజాలు అని చెబుతుంటే జగన్ మోహన్ రెడ్డి గారు భయపడి అమ్మ ఒడిని ఆశ్రయించారని, ఇన్నాళ్లు తల్లిని దూరం చేసుకున్న జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆమె దీవెనలు కావాలని ప్రాధేయపడినట్లు తెలిసిందని అన్నారు.

ys sharmila on cm jagan mohan reddy
ys sharmila on cm jagan mohan reddy

తల్లిని నాతో ఉంటావా?, ఉండవా?? అని దాదాపుగా బెదిరించినంత పని చేసినట్లు సమాచారం అందిందని అన్నారు. తల్లి తనతో ఉండకపోతే క్రైస్తవుల ఓట్లు ఎక్కడ చేజారి పోతాయని బెంబేలెత్తిపోతున్నారని, ఆమె చేత బైబిల్ పట్టించి ప్రచారం చేయించినా, జగన్ మోహన్ రెడ్డి గారు పంచె కట్టుకొని బొట్టు పెట్టుకుని తిరిగినా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. తల్లి చెల్లిని అవమానించి బయటకు పంపించిన నాడే మహిళా లోకమంతా మిమ్మల్ని వదిలేసుకుందని, ఇప్పుడు ఎన్ని టక్కు టమారా, గజకర్ణ, గోకర్ణ విద్యలను ప్రదర్శించినా ప్రయోజనం శూన్యం అని అన్నారు. మనసు చంపుకొని మీ తల్లి మీతో వచ్చినా, భయపెడితేనే వచ్చినట్లుగానే ప్రజలు భావిస్తారని, మీ పట్ల ఆమెకు ఏమీ మమకారం లేదని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news