ఇద్దరు ఉత్తర కుమారులే.. అంబటి ట్వీట్..!

-

మంత్రి అంబటి రాంబాబు జనసేన టిడిపి పొత్తులపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు చంద్రబాబు కోసమే పని చేశారని ఆయన ప్యాకేజీ ఇస్తారని మరోసారి నిరూపించుకున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేసారు. సున్నా సున్నా కలిస్తే ఫలిత సున్నా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ లోకేసుల సమావేశం తో ఏం లాభం అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. చంద్రబాబుకి మనోధైర్యం ఇవ్వడానికి రాజమండ్రి వెళ్ళానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. లోకేష్ పల్లకి మోయడం కోసం పనిచేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

టిడిపి జనసేన మీటింగ్ లో ఏదైనా విషయం ఉందా..? బలహీన పద్ధతిని బలోపేతం చేయడం కోసం కలిశానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు కానీ ప్రజలు ఈ కలయికని పట్టించుకోవడంలేదని తెలిపారు అంబటి రాంబాబు. మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా సొంత కుమారుడు అద్దె కుమారుడు ఇద్దరు ఉత్తర కుమారులే.. సూట్ కేసు తీసుకో లోకేష్ తో కలిసి పో అనే పోస్టుని ట్వీట్ చేశారు. టిడిపి కోసమే పుట్టిన పార్టీ జనసేన అని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news