సీబీఐ ఎంక్వయిరీకి సిద్ధమా : విజయ సాయి కి బండ్ల సవాల్

-

ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గ‌ణేష్, వైసీపీ ఎంపీ విజ‌యసాయి రెడ్డి మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్ తారా స్థాయికి చేరింది. ఒక్క‌రిపై ఒక్క‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటూ.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాజ‌కీయ వేడిని పెంచారు. బండ్ల గ‌ణేష్ అయితే త‌గ్గేదేలే.. అన్న‌ట్టు వ‌రుస ట్వీట్లతో ఎంపీ విజ‌యసాయికి కౌంట‌ర్లు వేస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు సీబీఐ ఎంక్వ‌యిరీ వేసుకుందామ‌ని ఎంపీ విజ‌య‌సాయి రెడ్డికి స‌వాల్ విసిరారు. ఎవ‌రు దొంగో సీబీఐ తెలుస్తుంద‌ని అన్నారు.

కాగ స‌చిన్ జోషీ, పూరీ, రామ్ చ‌ర‌ణ్ తేజ్ ను, తార‌క్ ను మోసం చేయాలేదా.. అని విజ‌య సాయి రెడ్డి ప్ర‌శ్నిస్తూ ట్వీట్ చేశాడు. దీనికి కౌంట‌ర్ గా వీళ్ల‌లో ఒక్క‌రితో అయినా.. స్టేట్ మెంట్ ఇప్పించు అని స‌వాల్ చేశారు. తాను టీడీపీ నేత‌ను కాద‌ని.. వైఎస్ ఫ్యాన్ అని స్ప‌ష్టం చేశారు. త‌ప్పు చేస్తే.. త‌న‌లాంటి చిన్న వాన్ని న్యాయ స్థానాలు ఊరుకోవ‌ని అన్నాడు. జ‌నాన్ని దోచుకునే వాళ్లు జైలుకు వెళ్ల‌డం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. చివ‌ర‌గా.. నీవు గొప్ప‌వాడ‌వి. నీ గురించి రాష్ట్రం మొత్తం చెప్పుకొంటుంద‌ని, చ‌రిత్ర సృష్టించావ్ అంటూ ఎద్దెవా చేస్తూ ట్వీట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version