ఏపీలో వారందరికి జగన్ శుభవార్త..రేపు ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.10వేలు!

-

ఏపీ ప్రజలకు జగన్ శుభవార్త చెప్పారు. రేపు ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.10వేలు వేయనుంది జగన్‌ సర్కార్‌. వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల చేయనుంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే… సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటనకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఈ నెల 29వ తేదీన అంటే రేపే సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటనకు బయలు దేరనున్నారు.

Release of fifth installment of YSR Vahana Mitra scheme
Release of fifth installment of YSR Vahana Mitra scheme

ఈ సందర్భంగా విద్యా ధరపురం స్టేడియం గ్రౌండ్‌లో వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం వైఎస్‌ జగన్‌. రేపు ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. విద్యాధరపురం స్టేడియం గ్రౌండ్‌లో వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమం జరుగనుంది. ఇక ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం కూడా ఉంటుంది. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news