రజనీకాంత్ వ్యాఖ్యలకు NTR ఆత్మ బాధపడి ఉంటుంది – రోజా సంచలనం

-

NTR శతజయంతి వేడుకల్లో చంద్రబాబుపై హీరో రజనీకాంత్ ప్రశంసలు కురిపించడంపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. రజనీతో చంద్రబాబు అబద్దాలు చెప్పించారన్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై రజనీకాంత్ కు అవగాహన లేదని ఆయన వాక్యాలకు ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడి ఉంటుందని చెప్పారు.

చంద్రబాబు లేనప్పుడే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని… చంద్రబాబు విజన్ 2021 వల్లే టిడిపి 23 స్థానాలకు పరిమితమైందని ఎద్దేవా చేశారు.అసెంబ్లీలో కనీసం మైకు కూడా ఇవ్వకుండా ఎన్టీఆర్ ను అవమానపరిచిన చంద్రబాబు నాయుడును రజనీకాంత్ పొగడటం చాలా బాధాకరమన్నారు.ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి యుగపురుషుడు అసెంబ్లీలో సింహంలా గర్జిస్తాడు అలాంటి వ్యక్తిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆమె ఘాటుగా విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news