నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు.. చంద్రబాబు ప్రకటన

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ రా కదిలిరా కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా బొబ్బిలి బహిరంగ సభలో టీడీపీ  చీఫ్ చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ బృతి ఇస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకటించారు. ఐదేళ్లలో జగన్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా యువతను మోసం చేశారు. అధికారంలోకి రాగానే రూ.3వేలు పింఛన్ ఇస్తానని చెప్పి.. తరువాత విడుతల వారిగా ఇస్తానని మాట మార్చాడు. 

నేను అధికారంలోకి వచ్చి ఉంటే మొదటి నుంచే రూ.3వేల పింఛన్ ఇచ్చేవాడిని అని బొబ్బిలి సభలో చంద్రబాబు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. విద్యుత్ ఉచితంగా ఇస్తామని.. ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. పేదలను ఆసరాగా చేసుకొని వైసీపీ దోచుకుందని తెలిపారు. అధికారంలోకి రాగానే మద్యం నిషేదం అని చెప్పారు. కానీ మద్యాన్ని నిషేదం చేశారా అని ప్రశ్నించారు చంద్రబాబు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 9 సార్లు విద్యుత్ చార్జీలను పెంచారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. కచ్చితంగా విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. 

Read more RELATED
Recommended to you

Latest news