వాసిరెడ్డి పద్మ ఇంట తీవ్ర విషాదం

-

ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడు, సీనియర్ జర్నలిస్ట్ అయిన వాసిరెడ్డి వేణు గోపాల్ ఈ రోజు ఉదయం కన్ను మూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం కన్నుమూసినట్లు సమాచారం. ఇక ఆయన జర్నలిస్టుగా అనేక సంవత్సరాల పాటు పత్రికలలో సేవలందించారు. ఇక వద్దనుకుని ఆ ఫీల్డ్ నుండి బయటకి వచ్చేసిన ఆయన వాసిరెడ్డి పబ్లికేషన్స్ పేరుతో ఒక పబ్లిషింగ్ హౌస్ మొదలు పెట్టారు.

అది ఇప్పుడు విజయవంతంగా నడుస్తోంది. ఈ పబ్లిషింగ్ హౌస్ ద్వారా ఎన్నో మంచి మంచి పుస్తకాలు పాఠకులకు అందించారు. ఇక ఆయన రచించి పబ్లిష్ చేసిన రోటి పచ్చళ్ళు అనే పుస్తకం ఇప్పటికి ఒక హాట్ కేక్ అనే చెప్పాలి. ఎన్ని మార్లు పబ్లిష్ చేసినా ఈ పుస్తకం హాట్ కేక్ లాగా అమ్ముడయ్యేది. ఇక ఈయన ఫైనాన్షియల్ మార్కెట్ విశ్లేషకులు. ఏకంగా పాతిక సంవత్సరాల పాటు అనేక పత్రికల్లో టీవీ ఛానల్లో ఫైనాన్షియల్ మార్కెట్ విశ్లేషణ పని చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news