చంద్రబాబుకు 118 కోట్ల ముడుపులు అందాయి – సజ్జల సంచలనం

-

చంద్రబాబుకు 118 కోట్ల ముడుపులు అందాయని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. షెల్ కంపెనీ ద్వారా చెందిన కిక్ బాక్స్ ఎలా తీసుకున్నారో ఇంగ్లీష్ పత్రికలు వార్తలు రాశాయని.. హిందుస్థాన్ టైమ్స్, డెక్కన్ క్రానికల్ లో కథనాలు వచ్చాయని తెలిపారు. ఇవాళ సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ ఇచ్చిన నోటీసులను కూడా ముద్రించారు…దీని పై ఎందుకు చంద్రబాబు స్పందించటం లేదని ఆగ్రహించారు.

మనోజ్ వాసుదేవ్ పార్థసాని అనే వ్యక్తిని విచారించే క్రమంలో అతను స్టేట్ మెంట్ ఇచ్చాడని..నేరుగా చంద్రబాబుకు 118 కోట్ల ముడుపులు అందాయని ఆరోపించారు. ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజి కంపెలకు కాంట్రాక్టు ఇచ్చారని మండిపడ్డారు.ఈ రెండు కంపెనీల ద్వారా కొన్ని షెల్ కంపెనీలకు మళ్ళినట్లు ఆధారాలతో సహా నోటీసులో పేర్కొన్నారని.. ఈ విషయాలు బయటకు వచ్చి 48 గంటలు అయినా చంద్రబాబు, ఆ పార్టీ నేతలు స్పందించ లేదన్నారు సజ్జల.

Read more RELATED
Recommended to you

Latest news