తెలుగుదేశం పార్టీ వెంటిలెటర్ పై ఉంది : 40 ఏళ్ల ఆవిర్భావంపై సజ్జల సెటైర్

-

ఇప్పుడు టీడీపీ పార్టీ అవసాన దశలో వెంటిలేటర్ పై ఉందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్ వేశారు. టీడీపీ పుట్టి 40 ఏళ్ళు అయ్యిందని సంబరాలు చేసుకుంటున్నారని.. ఇలా సంబరాలు చేసుకోవడం లో తప్పు లేదని ఆయన వెల్లడించారు. 1995లో ప్రజా నిర్ణయంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ను గద్దె దించటం కూడా చూడాల్సిన కోణమన్నారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ అని.. పార్టీ ఆవిర్భావం కూడా మీడియా మేనేజ్మెంట్ ఉందని చెప్పారు. కానీ అప్పటి రాజకీయ అవసరం వేరని.. అప్పుడు జర్నలిస్టుగా దగ్గరగా అన్ని పరిణామాలు చూసిన వాడినని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

కానీ చంద్రబాబు హయాంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని తొక్కి పూర్తిగా వ్యవస్థలను తనకు అనుకూలంగా మార్చుకున్న తీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఫైర్ అయ్యారు. జగన్ పూర్తిగా ప్రజాభిమానం తో ఆవిర్భవించిన నాయకుడు అని.. వచ్చే ఎన్నికల్లోనూ జగన్ మోహన్ రెడ్డిదే అధికారమని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news