విజయవాడ పార్లమెంట్ కి కాపలా కుక్కను.. కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు..!

-

నీతి, నిజాయితీ పరులే రాజకీయాల్లోకి రావాలి అంటూ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. సంపాదన కోసం కొంత మంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్ గా మారిందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను కానీ, నా కుటుంబ సభ్యులు ఎవ్వరూ బెజవాడ పశ్చిమ నుంచి పోటీ చేయరు. నా కుమార్తె శ్వేత పోటీ చేస్తారు అనేది వాస్తవం కాదు. బెజవాడ పశ్చిమ సీటు బీసీ లేదా మైనార్టీలది. నేను రాజకీయాల్లోకి వచ్చింది కేవలం ప్రజా సేవ కోసం మాత్రమే.

నేను ఈస్ట్ లేదా వెస్ట్ ఏలటానికి రాలేదు. కేవలం ప్రజా సేవకు మాత్రమే వచ్చాను. నేను దోచుకోను. మరి ఎవ్వరినీ దోచుకోనివ్వను. అందుకే నాపై అక్రమార్కులు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. విజయవాడలో అవినీతి, అక్రమార్కులను సహించేది లేదు. నేను ఎంపీగా లేకుంటే, టీడీపీలో లేకుంటే బెజవాడ పార్లమెంట్ ను జగ్గయ్యపేట నుంచి దోచుకోవచ్చని కొందరి ఆలోచన. వారితో పోరాడేందుకే సిద్ధంగా ఉన్నాను. కొన్ని కబంధ హస్తాల నుంచి వెస్ట్ నియోజకవర్గాన్ని కాపాడేందుకే బాధ్యత తీసుకున్నానని.. పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు మంచి వ్యక్తిని ఎన్నుకుంటారు అని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news