విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిపై లైంగిక దాడి

-

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగిపై లైంగిక దాడికి యత్నించాడు ఓ వ్యక్తి. గత అర్ధరాత్రి మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించగా.. అది గమనించిన తోటి రోగులు, అటెండర్లు ఆ కామాంధుడి దుశ్చర్యను అడ్డుకున్నారు. అనంతరం మహిళా తరపు బంధుమిత్రులు నిందితుడి పై మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు. బాధితురాలు మచిలీపట్నం కి చెందిన నాగలక్ష్మి (25) గా తెలుస్తోంది. కాగా నిందితుడు గుంటూరు కి చెందిన చంద్రశేఖర్ గా గుర్తించారు పోలీసులు. నిందితుడిపై 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇక ప్రస్తుతం బాదిత మహిళ నాగలక్ష్మి పై వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాధితుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news