విరాళాలంటూ రోడ్డెక్కిన షకలక శంకర్.. కుదరదని వెనక్కి పంపిన పోలీసులు

-

కరోనా వలన ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న వారిని షకలక శంకర్ ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా సహయార్థం విరాళాలు సేకరించడానికి సినీ నటుడు షకలక శంకర్ విజయవాడ వెళ్లారు. బందరు రోడ్ నుంచి బీసెంట్ రోడ్ వరకు విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టిన షకలక శంకర్ బెంజి సర్కిల్ సెంటర్ కు చేరుకున్నాడు. ఆయితే బెంజ్ సర్కిల్ లో దానికి అనుమతి లేదని చెప్పిన పోలీసులు వెనక్కి పంపారు.

ఈ సంధర్భంగా సినీ నటులు షకలక శంకర్ మాట్లాడుతూ కరోనా కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయారని అన్నారు. ఇప్పటికే కరీంనగర్ లో విరాళాలు సేకరించి బాధితులకు అందచేసామన్న ఆయన ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలని ఆదుకునే ఉద్దేశంతోనే ఈ విరాళాలు సేకరిస్తున్నామని అన్నారు. ప్రత్యేకంగా ఒక్క చోటని నిర్ణయించుకోలేదన్న శంకర్ క్కడ విరాళాలు సేకరణ చేయాలనిపిస్తే అక్కడికి వెళ్లి పోతానని అన్నారు. అందుకే ఇప్పుడు విజయవాడ వచ్చానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news