బీజేపీకి సీఎ జగన్ ఊడిగం చేస్తున్నారు – షర్మిల ఫైర్‌

-

వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని వైఎస్‌ షర్మిల బాంబ్‌ పేల్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడారు. ఏపీ ప్రజలకు మేలు జరగాలని ఇచ్చాపురం నుంచి నా ప్రస్తానం మెదలు పెడుతున్నానని.. ప్రజలంతా నన్ను ఆశీర్వదించండని కోరారు. కాంగ్రెస్ కు రాజశేఖరెడ్డి ఎంత చేసారోనని…వైఎస్ కు కూడా కాంగ్రెస్ అంతే చేసిందన్నారు.

sharmila fires on jagan

కాంగ్రెస్ వైఎస్ కుటుంబం ను ఇబ్బంది పెట్టిందనటంలో వాస్తవం లేదని పేర్కొన్నారు ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాజశేఖర్ కుటుంబానికి తాను ఏం ఇబ్బంది పెట్టలేదని సొనియా చెప్పారని వివరించారు. రాజశేఖరరెడ్డి బిజెపికి వ్యతిరేకి , అసిద్దాంతాలను వ్యతిరేకించారన్నారు. బిజెపి మతతత్వ పార్టీ అని…ఏపీలో మొత్తం బిజెపిని ప్రజలు తృనీకరిస్తే..పాలకులు మాత్రం బిజెపికి బానిస అయిపొయారని ఆగ్రహించారు. సిఎం జగన్ బిజెపికి ఊడిగం చేస్తున్నారు…25 మంది ఎంపీలు కూడా బిజెపికే ఊడిగం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాహుల్ గాందీ మొదటి సంతకం ఏపీ స్పెషల్ స్టేటస్ పై పెడతాం అన్నారు….రాజశేఖరరెడ్డి ఆశయం రాహుల్ ను ప్రధాని చేయటం అని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news