బెజవాడ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. రహస్యంగా ఇద్దరికీ పెళ్లి ?

-

విజయవాడ యువతి మర్డర్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈరోజు స్వామి చేతిలో చనిపోయిన దివ్య, స్వామి ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని చెబుతున్నారు. కొన్నిరోజుల కిందట ఈ ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు కూడా స్వామి సోదరుడు మీడియాకి చెప్పాడు. వీరిద్దరి పెళ్లి యువతి కుటుంబానికి ఇష్టం లేదని, ఈ పెళ్లి విషయం ఇంట్లో తెలిసి దివ్యను హౌస్ అరెస్ట్ చేశారని అంటున్నారు.

నిన్న స్వామితో దివ్య తండ్రి గొడపడినట్లు కూడా అతని సోదరుడు చెబుతున్నారు. ఇక పోలీసులు ఏమో దివ్య, స్వామిలు ప్రేమించుకున్నారన్న విషయం మీద క్లారిటీ లేదని చెబుతున్నారు. అయితే దివ్య ఇంట్లో ఫ్యాన్‌కు చీరకట్టి ఉందని, అది ఎవరూ ఎందుకు కట్టారో విచారిస్తున్నామని తెలిపారు పోలీసులు. ఈ కోణంలో చూస్తే మరిన్ని అనుమానాలు ఈ కేసు గురించి జనంలో అనుమానాలు మొదలవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news