చుక్కల భూముల రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్..ఇవాళే పట్టాలు పంపిణీ

-

సీఎం వైఎస్‌ జగన్‌ నెల్లూరు జిల్లా కావలి పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ ఉదయమే సీఎం వైఎస్‌ జగన్‌ నెల్లూరు జిల్లా కావలి పర్యటనకు బయలు దేరుతారు. అయితే.. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 9.35 గంటలకు తాడేపల్లి నుంచి కావలికి బయలుదేరనున్నారు సీఎం జగన్‌. 10.30 గంటలకు కావలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంకు చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్‌… కావలి మిని స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా చుక్కల భూములను 22ఏ నిషేదిత జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కు కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్‌. అనంతరం చుక్కల భూముల అనుభవదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు జగన్. ఆ జిల్లాలో 18 వేల మంది రైతులకు 43 వేల 270 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కును కల్పించనున్నారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం… సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news