ఏపీ విద్యార్థులకు అలర్ట్‌..ఈ నెల 28 నుంచి సమ్మెటివ్ పరీక్షలు

-

ఏపీ విద్యార్థులకు అలర్ట్‌.. ఈ నెల 28 నుంచి సమ్మెటివ్ పరీక్షలు జరుగనున్నాయి. సమ్మేటివ్-1 పరీక్షల షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ సవరించింది. 1-5 తరగతులను ఈ నెల 28 నుంచి డిసెంబర్ 5 వరకు, 6-8 తరగతులకు డిసెంబర్ 8 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తోలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 24 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. కాగా, ఇంగ్లీష్ సబ్జెక్టులో టోఫెల్ పరీక్షను ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్, స్మార్ట్ టీవీలు ఉన్నచోటే ఈ పరీక్షలు పెడతారు. ఇక

ఇది ఇలా ఉండగా..తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఈనెల 29, 30న ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నె 30న అన్ని స్కూళ్లకు సెలవు ఉంది. 80 శాతం మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఈ నెల 29న ఉదయం 7 గంటల్లోగా వారు రిపోర్ట్ చేయాల్సి ఉంది. దీంతో సర్కార్ బడులకు 29న కూడా సెలవు ఇవ్వనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎన్నికల విధుల్లో ఉన్న టీచర్లకు డిసెంబర్ 1న కూడా సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version