ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

-

వాక్ పిక్ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం వాక్ పిక్ భూములకు సంబంధించి జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మసనం విచారణ జరిపింది. ఆస్తుల అటాచ్ మెంట్ కు సంబంధించి గతంలో వాక్ పిక్ కు అనుకూలంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఈడి.. సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే 15 ఏళ్ల వృధాగా గడిచిపోయాయని వాక్ పిక్ ప్రాజెక్ట్ తరపు న్యాయవాది సుప్రీం ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. వాదనలు విన్న సుప్రీం ధర్మసనం తదుపరి విచారణ, ఉత్తర్వులు ఇచ్చేవరకు స్టేటస్ కో అమలు చేయాలని ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news