టీడీపీ వాళ్లే 25 మంది ఇసుక దందా చేస్తున్నారు – జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

టీడీపీ వాళ్లే 25 మంది ఇసుక దందా చేస్తున్నారని తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేశారు తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి నియోజకవర్గంలో 25 మంది ఇసుక రవాణా చేస్తున్నారని బాంబ్‌ పేల్చారు తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. గతంలో ఇసుక అక్రమరవాణా అరికట్టేందుకు ట్రిబ్యునల్, హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్లిన ప్రయోజనం లేదని వెల్లడించారు.

Tadipatri TDP leader JC Prabhakar Reddy’s sensational comments

నా కోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డారని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేసి నాకు దూరం కావద్దని కోరారు తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇసుక అవసరమైతే మున్సిపాలిటీ ద్వారా రవాణా చేస్తామని ప్రకటించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ఓనర్లను వదిలిపెట్టనని హెచ్చరించారు తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news