కడప మేయర్ ఇంటి ముందు చెత్తను పోసిన ప్రజలు !

-

కడప మేయర్ ఇంటి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కడప మేయర్ ఇంటి ముందు చెత్తను పోసారు ప్రజలు. చెత్త పన్ను కట్టకపోతే చెత్త తీసుకువెళ్ళమని మేయర్ సురేశ్ బాబు.. హెచ్చరించారు. అటు చెత్త పన్ను కట్టొద్దని తెగేసి చెప్పారు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి. దీంతో మేయర్ ఇంటిని ముట్టడించి చెత్తను ఇంటి ముందు పోశారు జనం.

People dumped garbage in front of Kadapa Mayor’s house

ఇక అటు మేయర్ సురేష్ బాబు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నాయి టిడిపి శ్రేణులు. అదే సమయంలో మేయర్ సురేష్ బాబు ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు వైసిపి శ్రేణులు. ఇక ఈ తరునంలోనే… సంఘటన స్థలానికి చేరుకున్నారు కడప పోలీసులు. ఇరు వర్గాలకు సర్ది చెబుతున్నారు పోలీసులు.. వైసిపి శ్రేణులు కూడా ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఇంటి వద్దకు పయనం కానున్నారని సమాచారం. దీంతో కడపలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news