సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా : కేసినేని నాని

-

గత రెండు, మూడు రోజులుగా మీడియాలో కేసినేని నాని, కేసినేని చిన్ని గురించి వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ టీడీపీ అధిష్టానం నుంచి కేసినేనికి కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేసినేని నాని మీడియాతో మాట్లాడారు.

 ఎల్లుండి జరిగే సభకు నన్ను రావొద్దన్నారు. చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు అన్నింటికి సమాధానం చెబుతాను. రేవంత్ రెడ్డి గారు ఎగ్జాంపుల్.. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు అందరినీ కలిశారు. నేను కూడా అలాగే కలిశాను. అధినేత ఆజ్ఞను భక్తుడిలా పని చేస్తాను. ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డారు. నా పార్టీకి నేను కష్టపడ్డాను. కాలమే అన్నింటికి మూడోసారి ఎంపీని నేను అనే జ్యోస్యం చెప్పారు నాని. ఎంపీగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పా అని ప్రశ్నించారు కేసినేని నాని. మా వాళ్లందరికీ క్లారిటీ ఉంది. వసంత కృష్ణ ప్రసాద్, కేసినేని చాలా సన్నిహితులం అని చెప్పారు. ఇండిపెండెంట్ గానైనా పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు కేసినేని నాని.

Read more RELATED
Recommended to you

Latest news