జోగిరమేష్ ఇంటి పై టీడీపీ, జనసేన కార్యకర్తల దాడి !

-

మాజీ మంత్రి జోగిరమేష్ ఇంటి పై టీడీపీ, జనసేన పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు, ఇతరులు దాడికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటి పై రాళ్లు రువ్వారట టీడీపీ , జనసేన అల్లరిమూకలు. AP 39 KD 3267 కారులో వచ్చిన టీడీపీ, జనసేన కార్యకర్తలు… జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరారని సమాచారం.

TDP and Janasena activists attacked Jogiramesh’s house

రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం పోలీస్ కానిస్టేబుల్ చేశారు. అయితే ఆ కానిస్టేబుల్ పై తిరగబడ్డారట టీడీపీ, జనసేన కార్యకర్తలు. కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించిన అల్లరిమూకలు…మాజీమంత్రి జోగిరమేష్ ఇంటి పై దాడికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌ గా మారింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news