పవన్ కళ్యాణ్‌కు టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి వార్నింగ్

-

తెలుగు దేశం, బీజేపీ, జనసేన పార్టీల కూటమిలో లుక లుకలు బయటపడుతున్నాయి. పెద్ద నేతలు పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నా… కార్యకర్తలు, చిన్న స్థాయి లీడర్లు మాత్రం కొట్టుకుంటున్నారు.. తిట్టుకుంటున్నారు. అయితే.. తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

TDP leader Bojjala Sudhir Reddy warns Pawan Kalyan

మిత్రపక్షం అని ఊరుకున్నా.. లేదంటే శ్రీకాళహస్తిలో జనసేనను ఖాళీ చేసేవాడిని అంటూ పవన్ కళ్యాణ్‌కు పరోక్ష హెచ్చరికలు పంపారు మాజీ మంత్రి, శ్రీకాళహస్తి కూటమి అభ్యర్ధి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి. ఓ సమావేశంలో మాట్లాడుతూ…పవన్ కళ్యాణ్‌కు పరోక్ష హెచ్చరికలు పంపారు బొజ్జల సుధీర్ రెడ్డి. ఇప్పుడు ఈ సంఘటన వివాదంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news