మూడోరోజుకు చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్

-

టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ నేటికి మూడోరోజుకు చేరుకుంది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. ఇక ఇవాళ నేడు టిడిపి నేతలు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనుంది టీడీపీ పార్టీ. చంద్రబాబు అరెస్టుపై భవిష్యత్ కార్యాచరణలపై చర్చ నిర్వహించనున్నారు. చంద్రబాబు హౌస్ రిమాండ్ పై ఉత్కంఠ నెలకొంది.

Chandrababu

అటు రాజమండ్రిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మకాం వేశారు. కాగా, చంద్రబాబు అరెస్ట్‌ సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. అవినీతి అరోపణల కేసులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు భద్రతపై ఆయన లాయర్లు కోర్టుల పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే.. ఈ నేపథ్యంలో.. రాజమండ్రి కేంద్రకారాగారంలో ఎస్పీజీ ప్రొటక్షన్ కంటే ఎక్కువ భద్రతను కల్పించామని, చంద్రబాబు అనుమతి లేకుండా ఎవరు కూడా వారి బ్లాక్ వద్ద కు కూడా వెళ్లలేరని సీఐడీ తరఫున వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version