టీడీపీ నేతలు కుక్కల్లా మొరుగుతున్నారు – జోగి రమేష్

-

టిడిపి నేతలపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి జోగి రమేష్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి నేతలు కుక్కల్లా మొరుగుతున్నారని.. కర్రను తీసుకుంటే కుక్కలు పారిపోయినట్లు టిడిపి నేతలు పారిపోతున్నారని విమర్శించారు. మీ ఇంటికి వస్తే మీ నాన్న పారిపోయాడు.. మీ నాన్ననే ఉరికించాం నువ్వేంత లోకేష్ అని హెచ్చరించారు.

టైం, ప్లేస్ చెబితే నీ దగ్గరికి కూడా వస్తామని అన్నారు. పాదయాత్ర అంటే బౌన్సర్లను అడ్డుపెట్టుకొని చేయడం కాదన్నారు జోగి రమేష్. ప్రభుత్వంపై నిందలు వేయడం కోసమే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. గన్నవరం సభ ప్రభుత్వాన్ని తిట్టడం కోసమే పెట్టినట్లు ఉందన్నారు. పాదయాత్ర అంటే ఏంటో వైఎస్ఆర్, వైఎస్ జగన్ ని చూసి నేర్చుకోవాలన్నారు.

నడవలేని వృద్ధులు సైతం జగన్ పాదయాత్రకు వచ్చారని గుర్తు చేశారు. మీరు పాదయాత్రలు చేసినా.. వారాహి యాత్రలు చేసినా అధికారంలోకి వచ్చేది లేదన్నారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ భీమవరంలో, చంద్రబాబు కుప్పంలో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news