టిడిపి నేతలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు – వాసిరెడ్డి పద్మ

-

సత్యసాయి జిల్లా కదిరిలో విషాదం చోటుచేసుకుందిి. ఓ టిడిపి నేత లైంగిక వేధింపులకు బాలిక బలి అయింది. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఎర్రవెల్లి గ్రామంలో బాలిక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్న టిడిపి నేత రాళ్లపల్లి ఇంతియాజ్ తనను లైంగికంగా వేధించాడని, బాలిక ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో తెలిపింది. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనిపై దర్యాప్తు వేగవంతం చేసి నిండుతుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. టిడిపి నేతలు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తుంది అన్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటే మళ్ళీ ఇలాంటివి జరిగేవి కాదన్నారు. నిందితులను టిడిపి వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. సత్య సాయి జిల్లాలో వరుసగా టిడిపి నేతలు లైంగిక వేధింపులకు కారణం చంద్రబాబు వెనకేసుకురావడమేనన్నారు. ఇలాంటి ఘటనలను మహిళా కమిషన్ సహించే ప్రసక్తే లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news