పిల్లల కళ్ళజోళ్ళ మీద సీఎం జగన్ బొమ్మ..టీడీపీ విమర్శలు !

-

పిల్లలకు ఇచ్చే కళ్ళజోళ్ళ మీద కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఫోటోలు దర్శనమిచ్చాయి. ఇటీవల స్కూళ్లలో చిన్నారులకు కంటి వెలుగు పథకంలో భాగంగా వైద్య పరీక్షలు చేసిన విషయం తెలిసిందే. జిల్లాలోని పలు స్కూళ్లలో అవసరమైన బాలబాలికలకు మంగళవారం కళ్లజోళ్ళు పంపిణీ చేశారు.

tdp trolling cm jagan

కళ్ళజోడు పెట్టుకునే పెట్టె మీద సైతం సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఫోటోలు పార్టీ రంగులతో ప్రచురితమయ్యాయి. ప్రచారం కోసం పిల్లలను సైతం వదలడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ముఖ్యoగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని టీడీపీ పార్టీ విమర్శలు చేస్తోంది. ఏపీ సీఎం జగన్ ప్రచారకాంక్షకు మరో ఉదాహరణ అంటూ ఈ విషయం పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది తెలుగు దేశ పార్టీ.

Read more RELATED
Recommended to you

Latest news