టీడీపీ ఎన్నిక‌ల కోడ్ ను ఉల్లంఘిస్తుంది – లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ

-

ఆంధ్ర ప్ర‌దేశ్ లో జ‌రుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంచుతోందని ఎన్నిక‌ల సంఘానికి వైసీపీ నేత లేళ్ళ అప్పిరెడ్డి ఫీర్యాదు చేశాడు. అలాగే టీడీపీ నేత‌లు దొంగ ఓటర్లను తరలిస్తున్నారని ఫిర్యాదు అన్నారు. చంద్ర‌బాబు ఉనికి కోసం నానా పాట్లు ప‌డుతున్నాడ‌ని అన్నారు. ఓటుకు ఐదు వేలు నుంచి పదివేలు పంచుతున్నార‌ని ఆరోపించారు. అలాగే ఏ కేసులో అయినా 48 గంటల్లో స్టే తీసుకు వస్తానని లోకేష్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు.

టీడీపీ నేత లోకేష్ న్యాయస్థానాలను కించపరిచేలా, అగౌరపరిచేలా మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఎన్నికల కోడ్ ను టీడీపీ ఉల్లంఘిస్తున్నారని చంద్రబాబు పై కేసు నమోదు చేసి.. చర్యలు తీసుకోవాలి ఎన్నిక‌ల క‌మిష‌న్ ను కోరామ‌ని ఎమ్మెల్సీ అప్పి రెడ్డి అన్నారు. కుప్పం తో పాటు చాలా చోట్ల విచ్చ‌ల విడిగా డ‌బ్బులు పంపిణీ చేస్తున్నారని అన్నారు. అయితే చంద్ర బాబు కుప్పంలో ఎన్ని నాట‌కాలు వేసిన ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని అన్నారు. టీడీపీ కుప్పంలో ఓడిపోవటం ఖాయమ‌ని లేళ్ల అప్పి రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news