తెలుగుదేశం టెర్రరిస్టుల పార్టీ – డిప్యూటీ సీఎం నారాయణస్వామి

-

తెలుగుదేశం టెర్రరిస్టుల పార్టీ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏరియా ఆసుపత్రి ప్రారంభించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి. చంద్రబాబు నాయుడు పై మండి పడ్డారు నారాయణ స్వామి.

Telugu Desam Terrorist Party Said Deputy CM Narayanaswamy

తెలుగుదేశం పార్టీని టెర్రరిస్టులతో పోల్చిన నారాయణస్వామి…వెన్నుపోటు దారుడు చంద్రబాబు అంటూ ఆగ్రహించారు. ఎన్టీఆర్ పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు నాయుడు పై ఫైర్ అయిన మంత్రి పెద్దిరెడ్డి….చంద్రబాబు మేనిఫెస్టోలో ఇంటికి ఒక బంగారు ముద్ద ఇస్తానని చెప్తాడని చురకలు అంటించారు. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ట్రాక్టర్ ఇస్తానంటాడు…యువకులకు మోటార్ సైకిల్ ఇస్తాను అంటాడని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు నమ్మి మోసపోవద్దని కోరారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.

Read more RELATED
Recommended to you

Latest news