BREAKING : గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత

-

BREAKING : ఏపీలోని గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గంగవరం పోర్టు ప్రధాన ద్వారం వద్దకి కార్మికులు, కార్మిక సంఘం నేతలు భారీగా చేరుకున్నారు. ఈ తరుణంలోనే.. కార్మికులకు పోలీసులకు మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో పది మంది పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాజువాక సీ. ఐ కాలికి ముల్ల కంచె దిగింది.

అలాగే ఇద్దరు కానిస్టేబుళ్లకు తలకి తీవ్ర గాయాలయ్యాయి. బ్యారి కెడ్లు పెట్టి అదుపు చేసి…అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఛలో గంగవరం పోర్టుకు కార్మికల సంఘం పిలుపునివ్వడంతో… గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీత భత్యాలు పెంచాలనే డిమాండ్‌ తో ఛలో గంగవరం పోర్టుకు కార్మికల సంఘం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి కమ్యూనిస్టులు కూడా మద్దతు ఇచ్చారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news