బ్రేకింగ్:విశాఖలో ఘోర ప్రమాదం…!

-

విశాఖ హిందుస్తాన్ షిప్ యార్డ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వరకు మరణించారు అని వార్తలు వస్తున్నాయి. ఒక భారీ క్రేన్ కూలి ఈ ప్రమాదం జరిగింది. క్రేన్ ని తనిఖీ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. క్రేన్ కింద కొంత మంది చిక్కుకున్నారు అని తెలుస్తుంది. వారిలో మరణాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ముందు రెండు మృతదేహాలు బయటకు వచ్చాయి.

ఈ ప్రమాద ఘటనకు కారణం ఏంటీ అనేది స్పష్టత లేదు. ఘటన పై ఇంకా యాజమాన్యం స్పందించలేదు. ఘటన జరిగిన సమాచారం అందిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విశాఖ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకున్నారు అని తెలుస్తుంది. ఈ ఘటనలో పది మంది వరకు పైగా గాయపడ్డారు అని తెలుస్తుంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news