చంద్రబాబు హెలిప్యాడ్ వద్ద మోగిన బాంబు బజర్.. తవ్వి చూస్తే..!

-

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు రా.. కదలిరా పేరుతో పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తూ.. అధికార వైసీపీ పై విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. ఈ సభల్లో సీఎం జగన్ అవినీతిని ప్రజాముఖంగా ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా చింతలపూడిలో ఏర్పాటు చేసిన రా..కదలిరా సభకు చంద్రబాబు హాజరుకానున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సభ ప్రాంగణంలో తనిఖీలు చేస్తుండగా.. చంద్రబాబు దిగేందుకు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద బాంబు బజర్ మోగడం కలకలం రేపింది. దీంతో బాంబు స్క్వాడ్ టీమ్ విస్తృతంగా తనిఖీలు చేసారు. బజర్ మోగిన వద్ద తవ్వి చూడగా అందులో నుంచి ఒక రాడ్ బయటపడింది. ఎలాంటి ప్రాణపాయం లేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా చంద్రబాబు చేపడుతున్న రా.. కదలిరా  సభలకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో అధికారులు ముమ్మరంగా తనిఖీలను చేపడుతున్నారు. మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు రానున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news