తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఐదోవ రోజు

-

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఇవాళ ఐదోవ రోజు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 8 గంటలకు మోహిని అవతారంలో భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. అలాగే ఇవాళ రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు తిరుమల శ్రీవారు.

అటు తిరుమల చేరుకున్న ప్రతి భక్తుడికి గరుడ వాహన సేవ దర్శనం లభించేలా ఏర్పాట్లు చేస్తూన్నారు టీటీడీ అధికారులు. 2 లక్షల మంది భక్తులు మాడవీధులలోని గ్యాలరిల ద్వారా విక్షించే అవకాశం కల్పించారు. మాడవీధుల ఉరేగింపు సమయంలో ఐదు ప్రాంతాల వద్ద క్యూ లైనులు ద్వారా భక్తులకు దర్శనం కలిగించేలా ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు.

కాగా, గరుడ సేవ సంధర్భంగా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు అధికారులు. గ్యాలరిలో వేచివున్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద సౌకర్యం అందించనున్నారు. అన్నప్రసాద సముదాయంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు భక్తులుకు అన్నప్రసాద వితరణ ఉండనుంది. 5 వేల మంది సిబ్బందితో భధ్రతా ఏర్పాట్లు చేశారు. 2700 సిసి కెమరాలతో కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version