ఏపీలో కొత్త జిల్లాలపై మొదలైన కసరత్తు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తుంది ఏపీ సర్కార్. చాలా వరకు కూడా ఏపీలో కొత్త జిల్లాలకు సంబంధించి సిఎం జగన్ ఇప్పుడు అధికారులకు పలు సూచనలు కూడా చేసారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా కొత్త జిల్లాల ఏర్పాట్లు పై తొలి అధికారిక సమావేశం జరిగింది. గుంటూరు జిల్లా కలెక్టర్ అధ్యక్షత న జరిగిన సమావేశంలో జిల్లా యంత్రాంగం, ఎస్పీ లు విశాల్ గున్ని, అమ్మిరెడ్డి పాల్గొన్నారు.

కొత్త జిల్లా ఏర్పటు పై సరిహద్దులు ఏర్పాటు కి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కొత్త జిల్లా లో ప్రభుత్వ కార్యాలయాలు కి స్థలం కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పారు. ఇక పై ప్రతి శనివారం సాయంత్రం కొత్త జిల్లాల ఏర్పాటు పై అధికారులు తో సమావేశం నిర్వహిస్తాం అన్నారు. సంక్రాంతి లోపు కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news