పశ్చిమ గోదావరిలో దారుణం..భార్య పీక కోసి చంపిన భర్త

-

పశ్చిమ గోదావరిలో దారుణం చోటు చేసుకుంది. భార్య పీక కోసి పరారయ్యాడు ఓ భర్త. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. ప.గో ఆకివీడులో దారుణం చోటు చేసుకుంది. భార్యను చాకుతో పొడిచి చంపాడు రాంబాబు అనే భర్త. భార్య వాడపల్లి సంధ్యారాణి భర్త రాంబాబు మధ్య కొన్ని రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయట.

ఈ తరుణంలోనే.. గుడికి బండిపై వెళుతున్న భార్య సంధ్యారాణిని వెనుక నుంచి వచ్చి పొడిచి చంపాడు భర్త రాంబాబు. ప్రస్తుతం మృతురాలు భర్త రాంబాబు పరారీలో ఉన్నాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Latest news