బెంగళూరు KSR రైల్వేస్టేషన్‌లో ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

-

బెంగళూరులో ఓ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కేఎస్‌ఆర్‌ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. క్షణాల్లో మంటలు వ్యాపించి దట్టమైన పొగ అలుముకుంది. ప్రయాణికులు రైలు నుంచి దిగిన రెండు గంటల తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారమం అందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదం కారణంగా రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా పొగలు కమ్మేసి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

మరోవైపు మహారాష్ట్రలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగాయి. నాగ్‌పుర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అధికారులు రైలు నిలిపివేశారు. ప్రయాణికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం జరగలేదని.. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news