చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం తీసుకున్న అధికారి సస్పెండ్ !

-

సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం అడిగాడు. చివరకు సస్పెండ్‌ అయ్యాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్‌ డివిజన్‌ చేసేందుకు లంచం తీసుకున్న ఓ డిప్యూటీ సర్వేయర్ సస్పెండ్ అయ్యారు.

The officer who took a bribe to Chandrababu’s house was suspended

శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద ఇల్లు కట్టేందుకు టీడీపీ నాయకులు దరఖాస్తు చేశారు. స్థలాన్ని సబ్‌ డివిజన్‌ చేసేందుకు హుస్సేన్ రూ.1.80 లక్షలు డిమాండ్ చేయగా.. ఓ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. లంచం అడగడం నిజమని తేలడంతో అధికారిని సస్పెండ్ చేశారు. ఇక తెలుగు దేశం కూటమి ప్రభుత్వంలో అధికారులు లంచం తీసుకోవడం ఉండదని.. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే… చర్యలు తప్పవని చంద్రబాబు కూడా హెచ్చరించారట.

Read more RELATED
Recommended to you

Latest news