అమ్మవారికి మొక్కి.. అమ్మవారి మెడలో ఆభరణాలు చోరీ చేసిన దొంగ..!

-

సాధారణంగా దొంగలు రకరకాలుగా వ్యవహరిస్తుంటారు. ఏవిధంగా వ్యవహరించినప్పటికీ తాను చేయాల్సిన దొంగతనం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే అసలు దొంగతనానికి అడ్డూ, అదుపు లేకుండా పోయింది. భక్తి మాటున కొందరూ దొంగలు హద్దులు దాటుతున్నారు. ముఖ్యంగా అమ్మవారికి మొక్కి.. ఆ తర్వాత అమ్మవారి మెడలో ఆభరణాలు చోరీ చేసాడు ఓ దొంగ.

సీసీ కెమెరాలలో రికార్డు అయిన ఈ వీడియోను చూస్తూ అందరూ షాక్ అవ్వాల్సిందే. అది మరెక్కడో కాదండోయ్.. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణంలో బుగ్గకాల్వలోని బాటగంగమ్మ ఆలయంలో ఈ ఘటన జరిగింది. దేవతను కొలుచుకునేందుకు ఓ వ్యక్తి వచ్చాడు. అయితే ఆ వ్యక్తి ఎవ్వరికి అనుమానం రాకుండా సాధారణ భక్తుడిలా అమ్మవారిని దర్శించుకొని.. ఆపై అదును చూసి అమ్మవారి మెడలోని బంగారు గొలుసును దొంగిలించాడు. ఈ తతంగం అంతా అక్కడి సీసీటీవీ పుటేజీలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news