రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి – సజ్జల

-

ఆంధ్రప్రదేశ్ లో 60 లక్షల దొంగ ఓట్లు గుర్తించామన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గురువారం తాడేపల్లి లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొంగ ఓట్లపై టిడిపి అనవసర రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. టిడిపి తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. అక్రమాలలో చంద్రబాబు పీహెచ్డీ చేశాడని.. మాయ మాటలు చెప్పడం, గోడలు దూకడం ఆయనకి ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినప్పటి నుండే అలవాటని అన్నారు.

దొంగ ఓట్ల విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళతామని అన్నారు సజ్జల. టిడిపి గతంలో చేసిన తప్పులను తాము సరిచేశామన్నారు. వైయస్సార్సీపి ప్రజాస్వామ్యాయుప్తంగానే వ్యవహరిస్తుందన్నారు. టిడిపి గతంలో అన్యాయంగా తొలగించిన ఓట్లను ఇప్పుడు చేర్పించామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news