చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై వర్మ 12 ప్రశ్నలు ఇవే..!

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సమర్ధించే వాళ్ళెవరైనా ఈ 12 ప్రశ్నలకు వన్ వర్డ్ లో ఆవునా? కాదా ? అనే ఫార్మాట్ లో సమాదానమిస్తారా ? అని ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆ ప్రశ్నలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.


1.స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుపై చేసుకున్న ఒప్పందం బోగస్.. అవునా ?

2.ఈ ఫేక్‌ ఒప్పందం తోనే రూ 300 కోట్లు పైగా ఇచ్చేశారు.. అవునా ?

3.ఆంధ్రప్రదేశ్‌ ప్రభత్వం నుంచి ఈ డబ్బు విడుదల చేయడానికి అన్ని రూల్స్‌ను ఉల్లంఘించారు . డబ్బు విడుదలకోసం అధికారుల అబ్జెక్షషన్స్ పెడచెవిన పెట్టారు. ..అవునా ?

4. తమకు ఎలాంటి డబ్బు ముట్టలేదని, అసలు ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని ,సీమెన్స్‌ కంపెనీ లిఖిత పూర్వకంగా చెప్పింది …అవునా ?

5. 90శాతం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఇచ్చే ఎలాంటి స్కీం తమ వద్దలేదని సీమెన్స్‌ చెప్పింది …. అవునా ?

6. ఈమేరకు సెక్షన్‌ 164 CRPC కింద జడ్జి ఎదుట ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాధికారులు, సీమెన్స్‌ అధికారులు స్టేట్‌మెంట్లు ఇచ్చారు . …అవునా ?

7. విడుదల చేసిన ఆ డబ్బు ఎక్కడికి పోయిందో తెలుసుకోవాల్సిన భాద్యత ప్రభుత్వానికి వుంది … *అవునా ?

8. ఆ డబ్బును ఎవరు తీసుకున్నారో కనిపెట్టాల్సిన భాద్యత ప్రభుత్వానికి వుంది . …అవునా ?

9. రూ. 300 కోట్లకుపైగా డబ్బును షెల్‌ కంపెనీల ద్వారా, మధ్యవర్తుల ద్వారా మళ్లించారు. ….అవునా ?

10. స్కిల్‌ కేసులో ED దర్యాప్తుచేసి నలుగురిని అరెస్టుచేసి ఆ విషయాన్ని ED తన అక్కౌంట్‌ ద్వారా ట్వీట్‌ చేసింది . అధికారికంగా పత్రికా ప్రకటన విడుదలచేసింది .. ఇప్పుడు మీ అభియోగం సెంట్రల్ ఏజెన్సీ అయిన ED ఈ విషయంలో రాజకీయ ప్రతీకారానికి దిగిందని అంటున్నారు … అవునా ?

11. విజయవాడలోని ACB కోర్టు దాదాపు 10 గంటలసేపు ఇరుపక్షాల వాదనలు విని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించే చంద్రబాబుకు రిమాండ్‌ విధించింది … అవునా ?

12. ఇళ్లనిర్మాణం విషయంలో డబ్బు చంద్రబాబుగారి చేతిలోకి వెళ్లిందనే విషయాన్ని ఐటీ నోటీసుల ద్వారా ఎలా వెలుగులోకి వచ్చిందో , అలాగే స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాంలో అనేక షెల్‌ కంపెనీలు, నిందితులైన యోగేష్‌ గుప్తా, మనోజ్‌ వాసుదేవ్‌ పార్దసాని తదితరుల ద్వారా ఆయన మాజీ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్‌కు, అక్కడ నుంచి ఆయనకు చేరిందని ED చెప్తోంది. …అవునా ?

ఒక వేళ కాదంటే.. పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు పారిపోయినట్టు ? అని ప్రశ్నించారు. ఇక ఈ 12 ప్రశ్నలకు స్పందించకపోతే అన్ని ప్రశ్నలకి అవునని సమాధానమిచినట్టే! అని ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news