విశాఖ పై వైసీపీ విజన్ ఇదే : షర్మిల

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ఓవైపు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ-జనసేన, బీజేపీ నేతలు ఒకరికొకరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ తరుణంలోనే ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూడా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలపై మండి పడుతున్నారు. ముఖ్యంగా ఏపీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయి..? అని ప్రశ్నిస్తున్నారు.

తాజాగా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పై ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. పరిపాలన రాజధానిలో పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందని ప్రశ్నించారు. విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడమే మీ చేతకాని కమిట్మెంట్ అని మండిపడ్డారు. గుట్టల్ని కొట్టం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం విశాఖ పై వైసీపీ విజన్ ఇదే అని సెటైర్లు వేశారు షర్మిల. ఎన్నికల ముందు పదేళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలకు తెరతీయడం నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం షర్మిల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news