వినుకొండలో చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం

-

ఏపీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఇన్నోవా కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. మృతులు గుంటూరుకు చెందిన వారిగా గుర్తించామని పట్టణ సీఐ సాంబశివ రావు తెలిపారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి గుంటూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తేలియజేస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news