BREAKING : నంద్యాలలో 8 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

-

నంద్యాల జిల్లాలో బాలిక (8) అదృశ్యం ఘటన విషాదాంతమైంది. ఇంట్లో నుంచి అదృశ్యమైన బాలిక అత్యాచారానికి గురై చివరకు కామాంధుల చేతిలో బలైపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకుని విచారించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక మూడు రోజుల క్రితం అదృశ్యమైంది. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో ఆమె తండ్రి నందికొట్కూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానంగా కనిపించిన ముగ్గురు మైనర్‌ బాలురను అదుపులోకి తీసుకుని విచారించారు.

ఆదివారం సాయంత్రం ముచ్చుమర్రి పార్కు వద్ద బాలిక ఆడుకుంటుండగా సమీపంలోని ఎత్తిపోతల పథకం వద్దకు తీసుకెళ్లామని బాలురు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అత్యాచారం చేశారని, ఈ విషయం బయటపడుతుందనే భయంతో బాలికను కాల్వలోకి తోసేశామని చెప్పినట్లు వెల్లడించారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news