ఏపీ ప్రజలకు అలర్ట్..పిడుగులు పడే ఛాన్స్‌

-

ఏపీ ప్రజలకు అలర్ట్. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు చత్తీస్‌గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉన్నట్లు పేర్కొంది.

నేడు అనకాపల్లి,అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు ఉన్నట్లు తెలిపింది. సత్యసాయి,అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు ఉన్నట్లు పేర్కొంది. ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.

Read more RELATED
Recommended to you

Exit mobile version