ఏడాదిలోపే టిడ్కో, ఈఎంఐ ఇళ్ల పంపిణీ…ఏపీ సర్కార్‌ ప్రకటన!

-

ఏపీ పేదలు, మధ్యతరగతి, జర్నలిస్ట్ లకు అదిరిపోయే శుభవార్త చెప్పారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి. టిడ్కో,ఈఎంఐ ఇళ్లను ఏడాది లోపు పూర్తి చేసి అర్హులకు అప్పగిస్తామని ప్రకటించారు. ఇవాళ తిరుమల శ్రీవారిని మంత్రి కొలుసు పార్థసారధి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడారు.

Tidco, EMI distribution of houses within a year…AP Sarkar’s announcement

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ర్టంలో ఇళ్లులేని ప్రతి పేదవాడికి ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కొలుసు పార్థసారధి. పేదవారికి, మధ్యతరగతి, జర్నలిస్ట్ లకు సరసమైన ధరలకే ఇళ్లు అందిస్తామని పేర్కొన్నారు. టిడ్కో, ఈఎంఐ ఇళ్లను ఏడాది లోపు పూర్తి చేసి అర్హులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. రాబోవు 5 సంవత్సరాల కాలంలో ఏపి అభివృద్దిలో దూసుకు వెలుతుందని చెప్పారు. తరలివెళ్లిన పరిశ్రమలతో పాటు నూతనంగా ప్రరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవెత్తలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news