తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. అక్టోబరులో పలు ఆర్జిత సేవలు రద్దు

-

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. అక్టోబర్ నెలలో పలు రోజుల్లో శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. వీటి వివరాలను తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ ఏడాది అక్టోబరు 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

అక్టోబరు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సన్నిధిలో సుప్రభాత సేవ మినహా మిగిలిన ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మరోవైపు అదే నెల 11వ తేదీ, 12వ తేదీన మొత్తం ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు. అంగ ప్రదక్షిణ, వర్చువల్‌ సేవలు బ్రహ్మోత్సవాలకు ఒకరోజు ముందు నుంచే రద్దు చేశారు. అక్టోబరు నెలకుగాను ఆర్జిత సేవలు, ఎస్‌ఈడీ టికెట్లు ఈనెల 18వ తేదీ నుంచి జారీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news