నేడే ఎల్వీ సుబ్రహ్మణ్యం రిటైర్మెంట్..

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇప్పుడు పదవీ విరమణ చేయడానికి సిద్దమయ్యారు. గత ఏడాది ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర ఎన్నికల సంఘం మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పుడే ఎల్వీ సుబ్రహ్మణ్యం ని ఆ పదవిలో నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత జగన్ సిఎం అయినా సరే ఆయనను కొనసాగి౦చారు.

అప్పుడు చంద్రబాబు సర్కార్ కి ఆయన కంట్లో నలుసులా మారారు. చంద్రబాబు కేబినేట్ సమావేశం నిర్వహించాలి అని భావించినా సరే అప్పుడు ఆయన అడ్డు చెప్పారు. ఆ తర్వాత జగన్ సిఎం కావడం ఆయన అనుభవాన్ని గుర్తించి పదవిలో ఉండాలి అని కోరడం అన్నీ జరిగాయి. అయితే ఆ తర్వాత మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు గాని ఆయనను ఆ పదవి నుంచి తప్పించి నీలం సహానిని నియమించారు.

ఆ తర్వాత ఆయనను అకస్మాత్తుగా హెచ్‌ ఆర్డీ డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేస్తూ జీఏడీ పొలిటికల్‌ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆదేశాలు జారీ చేసారు. కాని ఆయన ఆ పదవిలో చేరకుండానే హైదరాబాద్ దీర్ఘ కాలిక సెలవులో వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఆయన సచివాలయానికి వెళ్ళలేదు. ఎల్వీ సుబ్రహ్మణ్యం 1983 ఐఏఎస్‌ బ్యాచ్‌ అధికారి. ఇక ఆయన ఆన్లైన్ లో చార్జ్ తీసుకుని రిటైర్ అయ్యే అవకాశం కల్పించింది ఏపీ సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news