వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అయితే..గుండు కొట్టించుకుంటా – తోపుదుర్తి

-

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అయితే..గుండు కొట్టించుకుంటానంటూ చంద్రబాబు నాయుడు కు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. నాకు రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారని.. నాకు యాభై కోట్ల రూపాయలు ఇస్తే చాలు ఆస్తులన్నీ రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్‌ విసిరారు. నా వద్ద ఉందంటున్న 1950 కోట్లతో రాప్తాడు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తావా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు కు దమ్ము, ధైర్యం ఉంటే ఈ సవాల్ ను స్వీకరించాలని ఛాలెంజ్‌ విసిరారు. పాల డైరీ, బోరు బావుల ద్వారా ప్రజలకు సేవ అందిస్తున్న నైజం నాదన్నారు. చంద్రబాబు బెదిరింపు లకు భయపడే నైజం నాది కాదు… వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను గుండు కొట్టించుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.హెరిటేజ్ ద్వారా రైతుల నుంచి 25 వేల కోట్ల రూపాయలు చంద్రబాబు దోపిడీ చేశారని ఆగ్రహించారు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news