కర్నూలు జిల్లా పాణ్యంలో విషాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య

-

కర్నూలు‌ జిల్లాలో హృదయ విదారక ఘటన జరిగింది. ..పాణ్యం మండలంలోని కౌలూరులో రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.. ఇద్దరు పిల్లలతో పాటు దంపతులు సూసైడ్‌ చేసుకున్నారు. నంద్యాల రోజా కుంట ప్రాంతానికి చెందిన గఫార్‌ మంగళవారం మధ్యాహ్నం భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఆటోలో నంద్యాల నుంచి ప్రాణ్యం మండలం కౌలూరు వద్దకు వచ్చాడు. గూడ్స్‌ రైలుకింద పడి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. . గఫార్‌ గతంలో ఓ బంగారం దుకాణంలో చోరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు..కేసు విచారణ నిమిత్తంతొ పలుమార్లు పోలీసులు విచారించారు..

కేసు చివరి దశకు చేరుకోవడంతో ఇప్పుడు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంపై అనేక అనుమాలకు దారితీస్తున్నాయి..మరోవైపు పోలీసుల వేధింపుల వల్లనే కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు..ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రైల్వే ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటంతో రోజాకుంట ప్రాంతంలో విషాదం అలుముకుంది.

Read more RELATED
Recommended to you

Latest news