పారదర్శకంగా నాటక రంగ నంది అవార్డులు ఎంపిక : పోసాని

-

ఆంధ్రప్రదేశ్ లో డిసెంబర్ 23, 2023న నాటక రంగ నంది అవార్డులను అందిస్తున్నామని ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పూర్తిగా పారదర్శకంగా అవార్డుల ఎంపిక చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రముఖ నాటకరంగ వ్యక్తులతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. 

నంది అవార్డుల కోసం 115 దరఖాస్తులు వచ్చాయి. అందులో 38 మందిని ఎంపిక చేశారు. 5 కేటగిరిలలో మొత్తం 74 అవార్డులను అందజేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీల సిఫారసులకు తావు లేదని పోసాని స్పష్టం చేశారు. సొంతగా టాలెంట్ ఉన్న వారికే ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. ఎలాంటి రాజకీయాలు ఉండవు అని తెలిపారు. రాజకీయాలకు ధీటుగా అవార్డులను అందజేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news