వివేక హత్య కేసులో నిజం బయటకి రావాలి – సునీత

-

నేడు వైయస్ వివేకానంద రెడ్డి నాలుగవ వర్ధంతి సందర్భంగా కడప జిల్లాలోని పులివెందుల లో వివేకా సమాధి వద్ద నివాళులు అర్పించారు వివేకా సతీమణి, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి. ఈ సందర్భంగా ఉద్వేగంగా మాట్లాడారు వైఎస్ వివేక కూతురు సునీత. వివేకా హత్య కేసులో నిజం బయటికి రావాలని.. న్యాయం గెలవాలన్నారు. దర్యాప్తు సంస్థలను ఎవరూ ప్రభావితం చేయకూడదన్నారు సునీత.

తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడాలన్నారు. ఈ కేసులో గతంలో సిట్ కానీ, ఇప్పుడు సీబీఐ కానీ విచారణ సందర్భంగా ఎవరైనా మాట్లాడటం సరికాదన్నారు. దర్యాప్తు సంస్థలను కానీ, పోలీసులను కానీ వారి దర్యాప్తు వారు చేసుకునేలా సహకరించాలని సూచించారు. వివేకా కేసు విషయంలో ఎంతో మంది తెలియకుండానే సహరిస్తున్నారని.. వారందరికీ కృతజ్ఞలు తెలిపారు సునీత.

Read more RELATED
Recommended to you

Latest news